ఒక వైపు శాంతి మంత్రం పఠిస్తూనే...మరోవైపు వెన్నుపోటు పొడిచింది పిరికిపంద చైనా. అంతర్జాతీయ సమాజంలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్న చైనా..ఇటీవల అమెరికాకు దగ్గరవుతున్న నేపథ్యంలో తట్టుకోలేపోతోంది. అటు పాకిస్థాన్ను.. ఇటునేపాల్ను.. భారత్పైకి ఉసిగొల్పుతోంది. వివాదిత గాల్వన్ లోయ ప్రాంతం అక్సాయి చీన్లో ఉంది. ఈ లోయ లద్దాఖ్, అక్సాయి చీన్ మధ్య భారత-చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ వాస్తవ నియంత్రణ రేఖ అక్సాయి చీన్ను భారత్ నుంచి వేరు చేస్తుంది. అక్సాయి చీన్ మాదని భారత్, చైనా రెండూ వాదిస్తున్నాయి. చైనా దక్షిణ షింజియాంగ్, భారత్ లద్దాఖ్లో ఈ లోయ వ్యాపించి ఉంది. భారత్ - చైనా బలగాల మధ్య లద్దాఖ్ వద్ద గాల్వన్ లోయలో చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలో 20మంది భారత సైనికులు వీరమరణం పొందిన ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ ఘర్షణలో అమరులైన వీర జవాన్ల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది. మృతుల్లో ఒకరు కర్నల్ కాగా మిగతా వారు నాయిబ్ సుబేదార్, హవిల్దార్, సిఫాయి హోదా కల్గిన వారు ఉన్నారు.
1. బి.సంతోష్బాబు (కర్నల్) - సూర్యాపేట, తెలంగాణ
2. నాదూరాం సోరెన్ (నాయిబ్ సుబేదార్) - మయూర్బంజ్, ఒడిశా
3. మన్దీప్ సింగ్ (నాయిబ్ సుబేదార్) - పటియాలా, పంజాబ్
4. సత్నం సింగ్ (నాయిబ్ సుబేదార్)- గురుదాస్పూర్, పంజాబ్
5. కె. పళని (హవిల్దార్) - మదురై, తమిళనాడు
6. సునీల్ కుమార్ (హవిల్దార్) - పట్నా, బిహార్
7. బిపుల్ రాయ్ (హవిల్దార్) - మీరట్ నగరం, ఉత్తర్ప్రదేశ్
సిపాయిలు..
8. దీపక్ కుమార్ - రీవా
9. రాజేష్ అరంగ్ - బిర్గుం
10. కుందన్ కుమార్ ఓఝా - సాహిబ్ గంజ్
11. గనేష్ రాం - కాంకేర్
12. చంద్రకాంత ప్రధాన్ - కందమాల్
13. అంకుశ్ - హమిర్పూర్
14. గుర్విందర్ - సంగ్రూర్
15. గుర్తేజ్ సింగ్ - మాన్సా
16. చందన్ కుమార్ - భోజ్పూర్
17. కుందన్ కుమార్ - సహస్ర
18. అమన్ కుమార్ - సమస్థిపూర్