సమాజంలో రోజురోజుకు మనుషులు మాయమైపోయి కామంతో కళ్లు మూసుకుపోయిన పశువులు కనిపిస్తున్నారు. కామందుల బారినపడకుండా ఉండేందుకు మహిళలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా లైంగిక దాడికి పాల్పడుతునే  ఉన్నారు కామాంధులు . దీంతో సగటు మహిళ జీవితం రోజురోజుకు ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎంత కఠినంగా శిక్షించిన ఎవ్వరిలో  మార్పు మాత్రం కనిపించడం లేదు. ప్రతిరోజు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనలు మహిళల జీవితాలను చింద్రం చేస్తూనే ఉన్నాయి. 

 


 తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన బ్యాంకు మేనేజర్.. ఓ యువతికి లోన్  ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శిశిరథాన్ సేన్ అనే వ్యక్తి.. సెంట్రల్ బ్యాంక్ బీరప్పటి  శాఖ లో మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇక రెండు నెలల క్రితం సెలవు పెట్టిన శిశిరాథన్ సేన్  తన స్వస్థలానికి వెళ్లగా అక్కడ ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. తాను బ్యాంకు మేనేజర్ అని... నీకు లోన్  ఇప్పిస్తాను అంటూ ఆ యువతికి నమ్మబలికాడు. 

 

 అయితే ఇలా లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆ యువతిపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు బ్యాంకు మేనేజర్ ముసుగులో ఉన్న కామాంధుడు. ఇక ఇటీవలే సెలవు ముగియడంతో బ్యాంకు కు  వచ్చి విధుల్లో చేరాడు. ఆ యువతి అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించింది బాధితురాలు. ఇక స్థానిక పోలీసులను ఆశ్రయించి తన గోడును వెల్లబుచ్చుకుంది. దీంతో శిశిరాథన్  పై కేసు నమోదు చేసిన  జార్ఖండ్ పోలీసులు అక్కడకు చేరుకొని అతన్ని.. అక్కడి సమీప పోలీసుల సహాయంతో అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: