టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు వ్యవహారం ఆ పార్టీలో ఏ స్థాయిలో సంచలనం సృష్టించింది అనే విషయం అందరికి తెలిసిందే. అచ్చెన్నాయుడు వ్యవహారంలో ఇప్పుడు ఎంత మంది ఉంటారు అనేది కూడా టీడీపీలో ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి ఆయనతో పాటుగా మాజీ మంత్రి ఒకరు కూడా ఈ వ్యవహారంలో ఉండే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని... మ‌రి కొంద‌రు కీల‌క నేత‌లు మాత్రం త‌మ పేర్లు ఎక్క‌డ బ‌య‌ట‌కు వ‌స్తాయో ? అని తీవ్ర ఆందోళ‌న చెందుతున్నార‌ట‌.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు విజయనగరం జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి మాత్రం ఇప్పుడు వ్యవహారం దెబ్బకు ఒడిశా లోని కటక్ వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది. ఈఎస్ఐ కుంభకోణం విషయంలో అచ్చెన్న తర్వాత ఎక్కువగా లబ్ది పొందిన వ్యక్తి ఆయనే అని అంటున్నారు. ఆయన స్టేట్ దాటి వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది. రెండు రోజుల క్రిత‌మే ఆయన స్నేహితుడి కారులో అక్క‌డ‌కు వెళ్ళారు అన్న గుస‌గుస‌లు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్్నాయి.

 

ఈ విషయానికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా పక్కా ఆధారాలను సేకరించారు అని పరిశీలకులు అంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు అనేది గుర్తించారు అని .... ఆయనను కూడా త్వరలో అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఆయన సన్నిహితులను కూడా దీనికి సంబంధించి అధికారులు ప్రశ్నించారు అని సమాచారం. ఇక మ‌రో మాజీ మంత్రి కొడుకు, ఆయన తమ్ముడు కూడా ఈ వ్యవహారంలో లబ్ది పొందారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: