విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త దేవినేని అవినాష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శాసనమండలిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేతల దాడిని అవినాష్‌ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మంత్రి శ్రీనివాస్‌తో పాటు మ‌రి కొంద‌రి నేత‌ల‌పైనా టీడీపీ వాళ్లు దౌర్జ‌న్యానికి దిగిన సంగ‌తి తెలిసిందే. మంత్రి అనిల్‌పైకి సైతం టీడీపీ నేతలు దూసుకు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే అవినాష్ గుణ‌ద‌ల‌లోని త‌న నివాసం వ‌ద్ద చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో టీడీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. 

 

ఈ సంద‌ర్భంగా అవినాష్ మాట్లాడుతూ పెద్దల సభలో మంత్రి మీద దాడి దేశ చరిత్రలో ఎపుడూ చూడలేదు. టీడీపీ సభ్యులు అందరూ రౌడీలుగా, గుండాలుగా వ్యవహరించారు. హుందాతనం లేని వాళ్ళు, కాల్ మనీ కేసులు ఉన్నవాళ్లు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని అనుకుంటే మండలిలో, కోర్టుల్లో అడ్డుకుంటున్నారు. మా మౌనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దు. గత 5 ఏళ్ళు రౌడీయిజం చేశారు. మరలా అలాంటివి చేస్తాం అంటే కుదరద‌ని ఫైర్ అయ్యారు.

 

ఇక టీడీపీ కేవ‌లం సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే ఉంద‌ని.. వైసీపీ గ్రౌండ్ లెవ‌ల్ పార్టీ అని ఎద్దేవా చేశారు. విధ్వంస‌కాలు, అరాచ‌కాలు త‌మ ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోద‌ని కూడా ఆయ‌న ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే అవినాష్ రౌడీలు, గుండాల‌తో పాటు కాల్ మ‌నీ కేసులు ఉన్న వాళ్లు ఎమ్మెల్సీలుగా ఉన్నార‌ని సెటైర్ వేశారు. ఈ ఘాటు సెటైర్ ఎవ‌రిని ఉద్దేశించి వేశారో మాత్రం అర్థం కావ‌డం లేదు. ఈ డైలాగ్ కృష్ణా జిల్లా ఎమ్మెల్సీల‌కా ?  లేదా ? ఇత‌ర జిల్లాల ఎమ్మెల్సీల‌కా ? అన్న‌దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: