ప్రస్తుతం చైనా - ఇండియా మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపైన ప్రముఖులు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావలే చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చైనీస్ ఫుడ్ను అమ్మే రెస్టారెంట్ల అన్నింటిని భారత్లో నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. అన్యాయంగా 20 మంది భారత జవాన్లను చైనా పొట్టనపెట్టుకుందని మండిపడ్డారు. దీంతో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా చైనా ఆహార పదార్థాలను, వాటిని అమ్మే రెస్టారెంట్లను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు.
ఆహార పదార్థాలే కాకుండా, చైనాలో తయారైన అన్ని రకాల వస్తువులను వదిలించుకోవాల్సిన సమయం వచ్చిందని అయన ట్విటర్ వేదికగా పిలునిచ్చారు. అయితే కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావలే ఇలా స్పందించగా నిన్నటికి నిన్న చైనాకు సంబందించిన 50కి పైగా యాప్లను నిషేధించాలి అని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. ప్రజలు కూడా ఆ యాప్స్ ని వెంటనే డిలేట్ చెయ్యాలి అని పేర్కొన్నాయి.
लडाख के गलवाणमें भारतीय सीमापर चीन के साथ हुई हिंसक झडप मे भारत के 20 जवान शहीद हुये है. वीरगती प्राप्त भारतीय जवानोंको विनम्रतापूर्ण श्रद्धांजली! शहिद जवानोंकी शहादत व्यर्थ नही जायेगी. शहीद जवानोंके परिजन के साथ भारत सरकार और सारे भारतीय खडे है! pic.twitter.com/CGgmW0WE4e
— Dr.Ramdas Athawale (@RamdasAthawale) June 17, 2020
चीन धोका देनेवाला देश है.भारत मे चीन के सभी वस्तुओंका बहिष्कार करना चाहीये.चायनीज फूड और चायनीज फूड के हॉटेल भारत मे बंद करने चाहीये ! pic.twitter.com/ovL2sOLUo4
— Dr.Ramdas Athawale (@RamdasAthawale) June 17, 2020