తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తుంది. గత కొన్ని రోజుల నుండి 200కు పైగా కరోనా కేసులు నమోదుకాగా నిన్న ఏకంగా ట్రిపుల్ సెంచరీని క్రాస్ చేసింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 352 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో కేవలం జిహెచ్ఎంసిలోని 302 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అయితే టెస్టులు ఎన్ని చేసిందో మాత్రం హెల్త్ బులిటెన్ లో వెల్లడించలేదు. ఈ కొత్త కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం 6027 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 3301మంది బాధితులు కోలుకోగా ప్రస్తుతం 2531కేసులు యాక్టీవ్ గా వున్నాయి. కాగా నిన్న కరోనా తో ముగ్గురు మరణించగా మొత్తం మరణాల సంఖ్య195కు చేరింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 18.06.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/QXdr2Qevuq
— Eatala rajender (@Eatala_Rajender) June 18, 2020