మనుషుల్లో నేర స్వభావం రోజు రోజుకీ మితిమీరిపోతుంది. వికృతమైన ఆలోచనలు కుటుంబాల వినాసనానికి దారితీస్తున్నాయి. బంధాలు మానవతా విలువలు మర్చిపోయి విపరీత బుద్ధితో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా రాజస్తాన్  లోని ఆళ్వార్ జిల్లా ప్రాంతంలో  కట్టుకున్న భర్తే భార్యని రేప్ చేయించిన అమానుష అక్కడ జరిగింది. భార్యని స్నేహితుడు అత్యాచారం చేస్తుంటే ఆ భర్త కాపలాగా ఉన్నాడు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన రాజస్తాన్ లోని ఆళ్వార్ జిల్లా షాజహాన్‌ పూర్ ప్రాంతం లో స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇక వివరాల్లోకి వెళ్తే....

 


ఓ వివాహిత(35)ను ఆమె భర్త భార్యకు మాయ మాటలు చెప్పి మార్కెట్‌ కు వెళ్దామని బైక్ ఎక్కించుకున్నాడు. ముందుగానే అనుకున్న పధకం ప్రకారం దారిలో తన స్నేహితుడైన మిచ్చు అలియాస్ బల్వంత్ ధనక్‌ ను తమ వెంట తీసుకెళ్లాడు. భార్య ఉండగానే అతన్ని కూడా అదే బైక్‌ పై ఎక్కించుకుని ఊరి చివర ఒక  నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బైక్ ఆపాడు. అక్కడ కొద్దిసేపు కూర్చున్న అనంతరం బల్వంత్ సడెన్‌ గా లేచి ఫ్రెండ్ భార్య చేయి పట్టుకుని సమీపంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లాడు. అక్కడ ఆమె పై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు స్నేహితుడు.

 


భార్యను ఫ్రెండ్ ‌కు అప్పజెప్పిన భర్త... ఆమెపై అత్యాచారం జరుగుతుంటే... అటువైపు ఎవరూ రాకుండా గది బయట కాపలా కాశాడు. ఈ దారుణ ఘటనతో బాధితురాలు షాక్ ‌కు గురైంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భర్త, అతని స్నేహితుడు బెదిరించడం తో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన ఆమె తనపై జరిగిన అఘాయిత్యాన్ని కన్వాళ్లకు చెప్పుకుని బోరుమని విలపించింది. పుట్టింటివారి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: