దేశంలో కరోనా విజృభిస్తున్న కారణంగా లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఆర్థికంగా చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి దారుణంగా మారింది. అయితే ఈ కష్టకాలంలో డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసం అమెజాన్ ఒక్క శుభవార్త తీసుకొచ్చింది.

 

 

దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా అమెజాన్ ఫ్లెక్స్ డెలివరీ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేశారు. అమెజాన్ దేశ వ్యాప్తంగా 35 పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అయితే గతేడాది అమెజాన్ కేవలం మూడు పట్టణాల్లో మాత్రమే ఈ డెలివరీ సేవలను పైలెట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేసిన విషయం అందరికి తెలిసిందేన్నారు.

 

 

అయితే తాజాగా అమెజాన్ ఫ్లెక్స్ డెలివరీ కింద గంటకు రూ.120 నుంచి రూ.140 వరకు సంపాదించొచ్చనాని యాజమాన్యం తెలిపారు. పార్ట్ ‌టైమ్ జాబ్ చేసుకునే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. మెట్రో, నాన్ మెట్రో ప్రాంతాల్లో అమెజాన్ ఫ్లెక్స్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ సర్వీసులను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ఈ సందర్బంగా అమెజాన్ తెలిపారు.

 

 

అమెజాన్ ఫ్లెక్స్‌లో చేరిన వారికి పార్ట్ టైమ్ ఉపాధి అవకాశం లభించినట్లు అవుతుందన్నారు. ఖాళీ సమయంలో ఈ పని చేసుకోవచ్చునన్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో డెలివరీకి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని అమెజాన్ ఇండియా లాస్ట్‌మైల్ ట్రాన్స్‌పోర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ రోచ్‌లాని తెలియజేశారు.

 

 

అమెజాన్ ఫ్లెక్స్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు కూడా డబ్బు సంపాదించొచ్చునన్నారు. వారి ఖర్చుల కోసం ఇంట్లో వారిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. ఎవరైనా ఇలా అమెజాన్‌తో జతకట్టాలని భావిస్తే.. అమెజాన్ ఫ్లెక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. డెలివరీ పార్ట్‌నర్‌గా జాయిన్ అవ్వాలని కంపెనీ యాజమాన్యం తెలియజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: