దయచేసి వినండి...ట్రైన్ నెంబర్ 0002 నెల్లూరు నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వెళ్లాల్సిన సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్...విజయవాడలో ఆగకుండా ఢిల్లీ వైపు దూసుకుపోతున్నట్లు సమాచారం. 37 బోగీలతో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు తోడైన సింహపురి ఎక్స్‌ప్రెస్. ఢిల్లీ వైపు దూసుకుపోతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ వెనుకే సింహపురి ఎక్స్‌ప్రెస్ కూడా నడుస్తోంది.

 

త్వరలో వైసీపీ ప్రకంపనలు రాబోతున్నాయని అర్ధం వచ్చేలా తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో ఓ వీడియోని వైరల్ చేశారు. ఇక పైన మాటలు అన్నీ ఆ వీడియోలోనివే. ఇంకా ఆ వీడియోలో చాలా సోది చెప్పారు గానీ...అసలు అర్ధం మాత్రం నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, నెల్లూరుజిల్లా(సింహపురి) వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిలు కలిసి ఓ 37 మంది వైసీపీ ఎమ్మెల్యేలని పట్టుకుని బీజేపీలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని అర్ధం వచ్చేలా తమ్ముళ్ళు ప్రచారం మొదలు పెట్టారు.

 

అయితే తమ్ముళ్ళు ఈ విధంగా ప్రచారం చేయడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవల కాలంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఎంత రచ్చ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. సొంత పార్టీ నేతలపైనే అవినీతి ఆరోపణలు చేశారు. ఇసుక, ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ఆ ఎమ్మెల్యేలు కూడా తిరగబడి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. గత వారం రోజుల నుంచి వీరి రచ్చ జరుగుతూనే ఉంది.

 

ఇక ఈ రచ్చ మొత్తంలో ఎంపీ రఘు పక్కా బీజేపీ వైపు వెళ్లిపోయారని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని అర్ధమవుతుంది. ఇదే సమయంలో ఆనం రామ్ నారాయణ రెడ్డి కూడా ఇటీవల కాలంలో సొంత నేతలపై , అధికారులపై ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మంత్రి అనిల్‌పై ఫైర్ అవుతూ మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు నేతలు సొంత పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, తెలుగు తమ్ముళ్ళు సరికొత్త ప్రచారం తెరమీదకు తీసుకొచ్చారు. ఈ ఇద్దరు కలిసి 37 మంది ఎమ్మెల్యేలని తీసుకుని బీజేపీతో కలుస్తారని మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటివి జగన్ దగ్గర కుదరవు. ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. కేవలం తమ్ముళ్ళు ఆత్మసంతృప్తి పొందడానికి ఇలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: