కరోనా మహమ్మారి ఎవర్ని వాడడం లేదు , దీనికి ధనిక బీద అనే తేడా లేదు.! రోజు వారి కూలీ అయినా, రాజకీయ నాయకుడైన దాని ముందు సమానమే, నానాటికీ కరోనా విజృంభన బాగా పెరిగిపోతుంది. లాక్ డౌన్ అమలులో ఎంత కఠినంగా ఉన్నా అరకొరగా కేసులు నమోదు అవుతూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే లాక్ డౌన్ సడలింపు మొదలయ్యాయో అప్పటి నుంచి దేశంలో తారా స్థాయికి కేసులు నమోదు మొదలయ్యాయి.
మొదట ఒకరి నుంచి ఒకరికి తెలియకుండానే చూపుతుందని చెప్పారు. ఇప్పుడు కంటి చూపుతో కూడా సోకుతుందని వైద్యులు చెప్పడంతో కలకలం రేగుతోంది. మొదటగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరిని కొంతమేరకు తప్పుగా అనిపించింది అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు...! ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించిన తర్వాతే కరోనా విషయంలో ఎన్నో నిజాలు ప్రపంచానికి తెలిసేలా చెప్పారు. అసలు వ్యాధి ఎక్కడ మొదలైందని చెప్పడానికి ఎంతో ఆలోచన చేసి వ్యూహం సిద్ధం చేశారు. కానీ అగ్ర రాజ్యాధిపతి కరోనా మొదలయింది చైనాలోనే అని చెప్పడానికి ఏ విధంగా సందేహించ లేదు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్న స్నేహాశిష్ గంగూలీ భార్యకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. గతవారంలో స్నేహాశిష్ అత్త, మామలకూ కొవిడ్ సంక్రమించినట్లు అధికారులు తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కుటుంబంలో ఒకరికి కరోనా సోకింది. గంగూలీ సోదరుడు.. బంగాల్ క్రికెట్ అసోసియేషన్(సీఏబీ) కార్యదర్శి స్నేహాశిష్ గంగూలీ భార్యకు పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలినట్లు రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు.
స్నేహాశిష్ అత్త, మామలకూ గత వారం కొవిడ్ సంక్రమించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు మోమిన్పుర్లోని స్నేహాశిష్ నివాసంలో సహాయక సిబ్బందికీ కరోనా సోకినట్లు సమాచారం. ప్రస్తుతం వారందరికీ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. అయితే.. స్నేహశిష్కు టెస్ట్లు చేయగా నెగటివ్గా తేలింది. ఆయనను గృహ నిర్బంధంలో ఉండాలని వైద్యులు సూచించారు.