గత నాలుగు నెలలు నుంచి ప్రజలను వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా.. చైనా నుంచి ప్రపంచ వ్యాప్తంగా పాకిన ఈ కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. లాక్ డౌన్ విధించి ఎంత కంట్రోల్ చేయాలని చూస్తున్నా కూడా కరోనా మహమ్మారి వికృత రూపాలను మార్చుకుంటూ ప్రజల పై కన్నెర్ర చేస్తుంది. ఇటీవల దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గు ముఖం పట్టడంతో లాక్ డౌన్ ను కొంత వరకు వదిలేశారు.  దీంతో ఒక్క సారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.. ఆంధ్రలో కొన్ని జిల్లాల్లో కరోనా ప్రభావం ప్రజలను భయ బ్రంతులకు గురిచేస్తుంది..

 

 


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు వెలుగుచూస్తున్న ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ మళ్లీ ప్రకటించారు. అంతేకాకుండా లాక్ డౌన్ ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం ఆదేశించారు.కేవలం నిన్న ఒక్క రోజే 465 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7,961కి పెరిగింది. తాజా కేసుల్లో ఎక్కువగా కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోనే ఎక్కువ పాజిటివ్ నమోదయ్యాయి.

 

 


ఇకపోతే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో ఇప్పటి వరకు 29 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో ఒకే కాలనీకి చెందిన 16 మంది ఉన్నారు. ధర్మవరంలో 34 కేసులు బయటపడ్డాయి. దీంతో అనంతపురంతోపాటు ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్‌డౌన్ విధిస్తూ కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 296 కేసులు నమోదయ్యాయి. ఒక్క ఒంగోలులోనే 14 ప్రాంతాల్లో కలిపి 69 కేసులు నమోదు కాగా, చీరాల పరిధిలోనే 46 కేసులు వెలుగుచూశాయి. 

 

 


దీంతో ఒంగోలు, చీరాలలో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు కలెక్టర్ భాస్కర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ నెల 11న జరిగిన ఓ సంస్మరణ సభలో 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు  హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తికి ఆ తర్వాత కరోనా సోకగా, కాశీబుగ్గకు చెందిన ఓ వ్యాపారి కూడా కరోనా బారినపడ్డాడు. దీంతో ఈ రెండు ప్రాంతాలను కట్టడి ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఈ మేరకు కలెక్టర్ నివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ జిల్లాల్లోని ప్రజలు కరోనాను నివారించడానికి సహకరించాలని ఆయా కలెక్టర్లు కోరారు..

మరింత సమాచారం తెలుసుకోండి: