ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని శిక్షలు విధించినా కామాంధుల కోరల్లో చిక్కుకుని  ఆడపిల్లలు బలి అవుతూనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటి కీ ఏదో ఒక విధంగా కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలు ఆడవాళ్లను వంచిస్తూ నే ఉన్నారు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది నీటి కోసం పంపు దగ్గరికి వెళ్లిన బాలికను కామందులు బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు ఇదేంటని ప్రశ్నిస్తే తండ్రి పై కూడా దుర్భాషలాడారు. ఇక ఈ అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలు ఏకంగా ఆత్మహత్య కు పాల్పడి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. 

 


 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఈ దారుణ ఘటన. వివరాల్లో కి వెళితే... ఘాజీపూర్ జిల్లా కసిమబాద్ పరిధిలోని ఓ గ్రామాని కి చెందిన బాలిక నీటిని తీసుకొచ్చేందుకు నీళ్ల పంపు వద్దకు వెళ్ళింది, ఇది గమనించిన మునిష్ చౌహన్  అనే పక్కింటి వ్యక్తి ఆ బాలికను బలవంతం గా లాక్కెళ్లాడు, అదే గ్రామానికి చెందిన ఘనశ్యామ్  ట్రక్కు లో ఆ బాలిక ను పడేసాడు ఇద్దరూ కలిసి ఆ బాలికపై దారుణం గా అత్యాచారం చేశారు. అనంతరం అచేతన స్థితిలోకి వెళ్లిన బాలికను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. 

 

 కాసేపటికి తేరుకున్న బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పడం తో ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి  నిలదీసేందుకు చౌహన్  ఇంటికి వెళ్లగా.. అతని కుటుంబ సభ్యులు బాలిక తండ్రి పై ఎదురుదాడికి దిగారు. దీంతో దిక్కుతోచని స్థితి లో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో హత్యాచారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవమాన భారం తో కుంగిపోయిన సదరు బాధిత బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: