ఈ మద్య మనుషులు చిన్న చిన్న విషయాలకు ఆవేశ పడటం.. అనాలోచిత చర్యలకు పాల్పపడటం జరుగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మద్య వచ్చే గొడవల్లో క్షణికావేశాలకు లోనై హత్యలకు దారి తీస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి.  తాజాగా ఓ పోలీసు కానిస్టేబుల్ క్ష‌ణికావేశంలో.. భార్య‌ను తుపాకీతో కాల్చి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లా కేంద్రంలో శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకుంది.   ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని రాజ్ నంద్ గావ్  లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు ముకేష్ మ‌న్హార్.

 

ఆయనకు భార్య, నాలుగేళ్ల పాప కూడా ఉంది. తన కుటుంబంతో మ‌న్పూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని రెసిడెన్షియ‌ల్ క్వార్ట‌ర్స్ లో ఉంటున్నారు. అయితే శుక్ర‌వారం రాత్రి ముకేష్, ఆయ‌న భార్య బాబిత మ‌ధ్య స్వ‌ల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం భార్యా భర్తల మద్య వచ్చిన అభిప్రాయ భేదాలు చిలికి చిలికి గాలివానలా మారింది.. దాంతో హ‌త్య‌, ఆత్మ‌హ‌త్య దాకా దారి తీసింది. ఇక భార్యతో గొడవపడి సహనం కోల్పోయిన పోలీసు కానిస్టేబుల్ త‌న వ‌ద్ద ఎస్ఎల్ఆర్ రైఫిల్ తో భార్య‌పై కాల్పులు జ‌రిపాడు.

 

దీంతో ఆమె కుప్ప‌కూలిపోయింది. ఆ త‌ర్వాత ముకేష్ త‌న‌కు తాను కాల్చుకున్నాడు. ఇద్ద‌రు ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిపోయారు. నాలుగేళ్ల పాప మాత్రం త‌ల్లిదండ్రి మృత‌దేహాల వ‌ద్ద కూర్చుండి పోయింది.  విషయం తెలుసుకున్న పోలీసులుఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఎల్ఆర్ రైఫిల్ ను సీజ్ చేశారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: