రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరికీ ఆ పార్టీ విప్ జారీ చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలు చేశారు. విప్పు లేదు గాడిద గుడ్డు లేదు అంటూ వల్లభనేని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అశోక్ బాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. తాను నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వాడిని కాదని, 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, తన మగతనం ఏమిటో గన్నవరం, విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గం చూసిందని, అశోక్ బాబుకు ప్రత్యేకంగా మగతనం  చూపించాల్సిన అవసరం లేదని నాని మండిపడ్డారు.

IHG


 ఒక రిటైర్డ్ ఉద్యోగి మాట్లాడే మాటలు ఇవేనా ? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, అసలు ఈ అశోక్ బాబు తెలుగుదేశం పార్టీ లోకి ఎప్పుడు వచ్చారు అని వంశీ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టామని, కానీ ఇప్పుడు ఉద్యోగం పోయాక వచ్చి వృద్ధనారీ ప్రతివ్రతలా అశోక్ బాబు మాట్లాడుతున్నారు అంటూ వంశీ ఎద్దేవా చేశారు. ఒళ్లు కొవ్వెక్కి మగతనం అని మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ హెచ్చరించారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా ముసుగేసుకుని ఉద్యోగులను ఎలా మోసం చేశారు అన్నది అందరికీ తెలుసున్నారు.


 అశోక్ బాబు లాంటి వాళ్ళను చర్చలకు పిలవడం టీవీ ఛానల్ వాళ్ళు మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గతంలో తనను సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ మళ్లీ ఇప్పుడు ఓటు వేయాల్సిందిగా ఏవిధంగా అడుగుతోంది అని ఆయన ప్రశ్నించారు. తన మగతనం చూడాలనుకుంటే టీవీలో కాదని, ఓటేసేందుకు వచ్చినప్పుడు అసెంబ్లీ వద్ద నిలదీసి ఉంటే అశోక్ బాబు కి చూపించే వాడిని అని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: