పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడా సినిమా చేస్తారని అందరూ ఎదురు చూడటం జరిగింది. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మళ్లీ సినిమారంగంలోకి వస్తారని ఎన్నికల అయిపోయిన వెంటనే సినిమాలు చేస్తారు అని భావించారు. కానీ పవన్ అప్పుడు ఇంకా సినిమాలు చేయను అని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వరుసగా వేణు శ్రీరామ్, క్రిష్ అదేవిధంగా హరీష్ శంకర్ ప్రాజెక్టులను ఓకే చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు.

 

ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు అయిపోయింది కొద్దిపాటి షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. లాక్ డౌన్ వలన ఆ బ్యాలెన్స్ షూటింగ్ నిలిచిపోవడంతో… దానిని కూడా కంప్లీట్ చేయాలని త్వరలోనే సినిమా మొదలు పెట్టడానికి పవన్ డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉండగా ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా సమయంలోనే చివరిలో క్రిష్ సినిమా పవన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనలేదు ఇంతలోనే కరోనా రూపంలో లాక్ డౌన్ ఏర్పడటంతో, సినిమా షూటింగ్ ఆగిపోయింది.

 

కాగా ఇటీవల హైదరాబాద్ నగరంలో భయంకరమైన వర్షాలు పడటంతో పవన్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకి సంబంధించిన సెట్ భారీగా డ్యామేజ్ అయిందట. దాదాపు కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టి వేసిన ఈ సెట్ పూర్తిగా డ్యామేజ్ అవ్వటంతో పవన్ సినిమా షూటింగ్ కూడా మొదలు అవ్వకుండా భారీగా నష్టం వచ్చినట్లు సినిమా నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ని ప్రకృతి పగబట్టింది అని ఇండస్ట్రీలో ఉన్న వారు ఫాన్స్ ఈ విషయం తెలుసుకుని కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: