ప్రపంచ ప్రసిద్ది పొందిన ఆలయాలు కొన్ని మాత్రమే ఉన్నాయి.. అలాంటి వాటిలో మన దేశంలో భక్తులు కలియు దైవంగా భావించి కొలిచే వారిలో ఏడుకొండల వెంకన్న ఒకరైతే.. పూరి జగన్నాథుడు ఒకరు.  కోట్ల మంది భక్తులతో  పూరీ జగన్నథ రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది.  కానీ ఈ ఏడాది మాత్రం అన్ని తలకిందులైయ్యాయి.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మొన్నటి వరకు ఆలయాలు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూరీ జగన్నథ రథయాత్ర ఎన్నో అనుమానాలు తలెత్తాయి.. అంతే కాదు కోట్ల మంది ఇక్కడికి వస్తే కరోనా భయంకరంగా పెరిగిపోతుందని కోర్టు అభ్యంతరం పెట్టింది. 45 అడుగుల ఎత్తుతో 16 చక్రాలతో జగన్నాథుని రథం, 44 అడుగుల ఎత్తుతో 14 చక్రాలతో బలభద్రుని రథం, 43 అడుగుల ఎత్తుతో 12 చక్రాలతో సుభద్ర రథాలను సిద్దం చేశారు.

IHG

భక్తులు తరలి రాకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా సుప్రీం కోర్టు సూచనల ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయకపోతే ప్రజలు రథయాత్రకు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం పూరీలో 40 గంటల పాటు పూర్తి స్థాయి షట్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.  

IHG

కానీ జూన్‌ 23న నిర్వహించకుంటే 12ఏళ్ల వాయిదా వేయాల్సి వస్తుందని, యాత్రకు అనుమతి ఇవ్వాలని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. అయితే పూరి జగన్నాథ యాత్రను నిలిపివేయరాదని..  దీనికి ఒడిశా ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. సుప్రీంకోర్టు తమ ఆదేశాలను పునర్‌ సమీక్షించింది. జగన్నాథ రథయాత్రకు అనుమతిస్తూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని దినేష్ మహేశ్వరి, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. భక్తులు లేకుండానే యాత్ర నిర్వహించాలని సూచించింది.

IHG

ఈ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో వేదపండితుల మంత్రోచ్ఛరణలతో మంగళవారం పూరీలో రథయాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధం అయింది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఉత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం లో తిలకించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. కేవలం పూరీలో మాత్రమే జగన్నాథ రథ యాత్ర నిర్వహించాలని సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: