జడ్చర్ల కాంగ్రెస్ సీనియర్ నేత రాంచంద్రారెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. అయితే ఆయన మర్డర్ మిస్టరీలో కొత్త కొత్త ట్విస్ట్ లు వెలుగు లోకి వస్తున్నాయి. రాంచంద్రారెడ్డిని హత్య చేసిన ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డి అతడి మృతదేహంతో కారులో ఏకంగా వంద కిలోమీటర్ల ప్రయాణించాడు. చివరికి ఏం చేయాలో పాలుపోక కారులో అతడి మృతదేహాన్ని పెంజర్లలో వదిలి పరారయ్యాడు.  పోలీసులు కథనం ప్రకారం.. గత కొంత కాలంగా ఓ భూమి విషయంలో రాంచంద్రారెడ్డి,  ప్రతాప్ రెడ్డి మద్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. 

 

పెద్దల సమక్షంలో కుదిరిన ఒప్పందంలో భాగంగా తనకు 5 ఎకరాలు ఇవ్వాలని ప్రతాప్ రెడ్డి కోరాడు. అందుకు అంగీకరించిన రాంచంద్రారెడ్డి భూమికి బదులుగా రూ.2.75 కోట్లు ఇస్తానని చెప్పి దస్తావేజులు, కోర్టు కాపీలు తీసుకున్నారు. కానీ కొంత కాలంగా ప్రతాప్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో రామచంద్రారెడ్డి ఆవేశానికి లోనయ్యారు. మరోవైపు తీసుకున్న అప్పుల ఒత్తిడి పెరిగింది. మరోవైపు, వివాదాస్పద భూమిలో ప్రతాప్ రెడ్డి తన తల్లి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా రాంచంద్రారెడ్డి అడ్డుకున్నాడు. అంతే అప్పటి నుంచి రాంచంద్రారెడ్డి పగ పెంచుకున్న ప్రతాప్ రెడ్డి అతన్ని ఎలాగైనా అంతమొందించాలని అనుకున్నాడు.

 

పథకంలో భాగంగా రాంచంద్రారెడ్డిని చర్చలకు పిలిచి షాద్‌నగర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో వెంట తెచ్చుకున్న కత్తెర, కొడవలిలో అతడి పొట్ట, మెడపై పలుమార్లు పొడిచాడు. దాంతో అతను మరణించాడు.  ఆ సమయంలో డ్రైవర్ విజయ్ వాహనం నడుపుతున్నాడు. కారులోనే మృతదేహాన్ని ఉంచుకొని వందకిలోమీటర్లు ప్రయాణించారు. చివరికి పెంజర్లలో వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రతాప్‌రెడ్డితోపాటు డ్రైవర్ విజయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: