వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక పేదవారు చదువుకు దూరం కాకూడదని ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని పేదలకు అందుబాటులో తీసుకురావడం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఏ పేదవాడు వైద్యం అందక చనిపోకూడదని అప్పులు పాలు కాకూడదని దాదాపు ప్రభుత్వమే వారికి వైద్యం అందించేలా వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇలా ఎక్కువగా పేద వారి పై భారంగా మారే చదువుని మరియు వైద్య రంగాన్ని ప్రభుత్వమే నడిపే లాగా ప్రజల పై భారం లేకుండా జగన్ నిర్ణయాలు తీసుకోవటం అందరికీ తెలిసిందే. సమాజంలో ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేసే విషయాలను ఫోకస్ చేస్తున్న జగన్ కొన్ని అరాచకాలపై కూడా ఫోకస్ పెడితే బాగుంటుందని కొంతమంది మేధావులు అంటున్నారు.

 

అదేమిటంటే సమాజంలో ఎక్కువగా ఆడపిల్ల పుడితే ఇటీవల రోజుల్లో పుట్టిన ఆడపిల్లని… కొంతమంది అత్తలు నచ్చక కోడలిని ఇంటికి రానీయకుండా చేస్తూ చిత్ర వాదులకు గురిచేస్తున్నారు. దీంతో ఆడపిల్ల పుట్టిన వెంటనే కొంతమంది భారంగా ఫీల్ అయ్యి ఆడపిల్ల నీ మురుగు గుంట దగ్గర అదేవిధంగా చెత్త కుప్పల దగ్గర పడేస్తూ రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన వైజాగ్ నగరంలో జరిగింది. సొంత కూతురు ఆడపిల్ల కందని స్వయంగా తల్లి అనగా పుట్టిన పిల్ల యొక్క అమ్మమ్మ స్వయంగా ఆ ఆడపిల్ల శిశువుని తీసుకెళ్లి నూతిలో పడేసింది. చివరాకరికి ఆ శిశువు చనిపోవడం జరిగింది.

 

తమ వంశంలో ఎక్కువగా ఆడపిల్లల పుడుతున్నారు అని సదరు పిల్ల తల్లి యొక్క తల్లి భావించి చంపినట్లు సమాచారం. ఈ విషయం మొత్తం వెలుగులోకి రావడంతో పోలీసులు శిశువు యొక్క తల్లిని మరియు ఆమె తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇలాంటి విషయాలపై కూడా వైయస్ జగన్ దృష్టి పెడితే పుట్టిన పిల్లల ప్రాణాలను కాపాడితే మహిళలు చేయి ఎత్తి దండం పెడతారు అని మేధావులు అంటున్నారు. తాగుబోతు భర్తలను మారుస్తున్న జగన్, పుట్టిన ఆడ పిల్లలను కూడా కాపాడితే బాగుంటుందని చాలా మంది సూచనలు ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: