కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు మార్చి 22 వతేది నుంచి దేశ వ్యాప్త లాల్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 80 రోజులు పైగానే లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసింది ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా అన్ని రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా లరాజ రవాణా వ్యవస్థ అయిన రైల్వే రంగానికి కూడా లాక్ డౌన్ ఎఫెక్ట్ అయింది. అయితే లాక్ డౌన్ కి ముందు చాలా మంది దూర ప్రయాణాలు చేయడానికి ముందుగానే టికెట్ లు బుక్ చేసుకున్నారు. అయితే లాక్ డౌన్ విధించిన తర్వాత రైళ్లు రద్దయిపోవడంతో చాలా మంది ప్రయాణికులు డబ్బులు వెనక్కి రాలేదు.

 

 


 దానిపైన ప్రభుత్వం కూడా చాలా రోజులు క్లారిటీ ఇవ్వలేదు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైలు ప్రయాణం రద్దెన ప్రయాణికులకు ఊరట కలిగించింది ఇండియన్ రైల్వే. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ , ప్రైవేటు సర్వీసులను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇందులో భాగంగా ఏప్రిల్ 14 ఆ తర్వాత రైళ్లలో ప్రయాణించేందుకు టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు అందరికీ డబ్బు పూర్తి వాపసు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. చాలా మంది రైల్వే ప్రయాణీకులు దూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు ప్రయాణానికి 120 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

 


 


 ఇలా లాక్ డౌన్కు ముందు పెద్ద సంఖ్యలో irctc ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు ప్రయాణికులు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఇండియన్ రైల్వే ఏప్రిల్ 15 నుంచి అన్ని సాధారణ రైళ్లలో బుకింగ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో రద్దెన రైళ్ల టికెట్లకుగాను ప్రయాణికులకు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తామని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం అత్యవసర ప్రయాణాల నిమిత్తం 230 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీంతో దూరప్రయాణాలు కొంతమేర ఊరట లభించిందనే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: