టైటిల్ చూసి షాక్ అయ్యారు కదా? నిజంగానే అగ్రరాజ్యం అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబం స్విమ్మింగ్ పూల్‌లో శ‌వ‌మై కనిపించినట్టు అక్కడ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అగ్ర‌రాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు సొంత ఇంటి పెరటిలోని స్విమ్మింగ్ ఫుల్  లో శవం అయ్యి కనిపించారు. 

 

IHG

 

అయితే చ‌నిపోయిన వారిలో 62 ఏళ్ళ భరత్‌ పటేల్, ఆయన 32 ఏళ్ళ కోడలు నిషా పటేల్‌, ఆయన ఎనిమిదేళ్ల మనవరాలు ఉన్న‌ట్లు ఈస్ట్‌ బ్రున్స్‌విక్ పోలీసులు గుర్తించారు. ఇంకా ఈ ఘటనపై లెఫ్టినెంట్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ... సోమవారం మధ్యాహ్నం భరత్ పటేల్ పొరుగింటి వారు ఈ ఘటనపై సీపీఆర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. 

 

IHG

 

దీంతో పోలీసులు వెంట‌నే ఘటనా స్థలానికి చేరుకున్నట్టు అయితే, అప్పటికే వారు మృతి చెందడంతో పోస్టుమార్టం కోసం మృతదేహలను ఆస్ప‌త్రికి తరలించినట్టు పోలీస్ తెలిపారు. అయితే వారు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌ ఫూల్‌లో పడి మృతి చెందారు అని  మిడిల్‌సెక్స్ కౌంటీ ప్రాంతీయ వైద్య పరీక్షల కార్యాలయం నిర్దారించినట్టు ఆయ‌న తెలిపారు. అయితే అక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆ కుటుంబం ఇటీవలే ఆ ఇంటికి కొత్త‌గా షిప్ట్ అయిన‌ట్లు సమాచారం.                     

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: