ఒక అక్రమ సంబంధం నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం గూడూరు కు చెందిన సోమిరెడ్డి భవాని దంపతులు. ఇంకా కొన్ని రోజులుగా భవాని అదే గ్రామానికి చెందిన బావ వరసైన సూర్యనారాయణరెడ్డి తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భవాని భర్త లేని సమయంలో సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్తున్నట్లు భవాని భర్త అయిన సోమిరెడ్డి సమాచారం అందడంతో పద్ధతిగా ఉండాలంటూ భార్యను హెచ్చరించారు. 

 

IHG

 

దింతో వీరి ఇద్దరి మధ్య చిన్న గొడవ జరగడంతో భవాని మనస్థాపంతో ప్రియుడు ఇంటికి వెళ్ళిపోయింది. ఇక ఆమె వెనకాలే సోమిరెడ్డి కూడా ప్రియుడి ఇంటి వద్దకు వెళ్లడంతో గొడవ మరింత పెద్దగా అయింది. ఈ తరుణంలోనే భవాని సూర్యనారాయణ ఇద్దరూ కలిసి సోమిరెడ్డి గొంతు పిసికి కర్రలతో కొట్టి సోమిరెడ్డి ని చంపేశారు. ఆ తర్వాత సోమిరెడ్డి మృతదేహాన్ని గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న ఒక గోతిలో పడేశారు. ఇక మరుసటి రోజు ఉదయం భవాని తన భర్త కనబడటం లేదు అంటూ కొత్త నాటకం మొదలు పెట్టింది.

 

IHG


దీనితో గ్రామస్తులు అందరూ కలిసి చుట్టుపక్కల ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టగా ఊరి చివర సోమి రెడ్డి మృతదేహం గుర్తించి పోలీసులకు అధికారులకు సమాచారం అందజేశారు. దీనితో సంఘటనా స్థలానికి మారేడుమిల్లి సీఐ, ఇద్దరు ఎస్ఐలు వెంటనే చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఇక అప్పటికే నిందితులు భవాని సూర్యనారాయణ రెడ్డి ఆచూకీ కనపడకపోవటంతో ఈ హత్యకు కారణం వారిద్దరే  అని పోలీస్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. ఇక సోమిరెడ్డి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన మేరకు పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: