కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ ద్వారా మీడియాకు విడుదల చేయడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో నేడు కొత్తగా 442 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10580 కు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 3716 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.

 

 


మరోవైపు నేడు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 519 మంది కరోనా వైరస్ నుంచి బయట పడి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 6670 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. అలాగే నేడు ఒక్కరోజే రాష్ట్రం మొత్తం ఆరు మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 180 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులలో 160 మందికి కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. గడచిన 24 గంటల్లో విదేశాల నుంచి వచ్చిన 22 మందికి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 81 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: