కేరళలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గడం లేదు గత 6రోజుల నుండి ప్రతి రోజు 100కు పైగా కేసులు నమోదుకాగా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క రోజే 123 పాజిటివ్ కేసులు నమోదు కాగా మరో  53 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం 3726కేసులు నమోదుకాగా అందులో 1761కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 1941మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 22 మంది మరణించారు. 

ఇక దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి అందులో అత్యధికంగా మహారాష్ట్ర లో 4841, ఢిల్లీలో 3390, తమిళనాడు లో 3509 కేసులు బయటపడ్డాయి. ఈ ఒక్క రోజే  దేశ వ్యాప్తంగా 18000కేసులు నమోదుకావడం గమనార్హం. ఇక ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 491000 కేసులు నమోదు కాగా 15000 మరణాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు కేసుల తీవ్రత రోజు రోజు కు పెరుగుతుండడంతో జులై 1నుండి ఆగస్టు 12వరకు రైళ్ల రాకపోకలను నిలిపివేస్తునట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: