రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభిస్తున్న వేళ... ముందు జాగ్రత్తగా ఆగస్టు వరకు రైళ్తు   రద్దు చేసింది.  కరోనా మరింత ప్రబలకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు రైల్వే ఉన్నతాధికారులు. అయితే ప్రత్యేక రైళ్లు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. 

 

రోజు రోజుకూ  కరోనా కేసులు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా తొలగించాక.. దేశంలో  కరోనా కేసులు గణనీయ సంఖ్యలో  నమోదవుతున్నాయి. వివిధ  రాష్ట్రాల్లో  రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి.  రోజురోజుకూ పరిస్థితి విషమంగా మారుతూండటంతో  రైల్వే శాఖ.. ట్రైన్ సర్వీసులపై సమీక్ష జరిపింది. రైళ్లను రద్దు చూస్తూ .. మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.

 

టైమ్ టేబుల్‌ ఆధారిత అన్ని రెగ్యులర్‌ ప్రయాణీకుల రైలు సర్వీసులను ..అంటే.. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌ రైళ్లు ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది రైల్వే శాఖ. దీంతో జులై 1 నుంచి ఆగస్టు 12 మధ్య చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దవుతాయని రైల్వే బోర్డు వెల్లడించింది. 

 

కరోనా కట్టడికి మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ నిర్ణయంతో అన్ని రెగ్యులర్‌ ప్యాసింజర్‌ రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. తదుపరి నోటీసు జారీ చేసే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని అప్పట్లో రైల్వే శాఖ తెలిపింది. ఆ తర్వాత దాన్ని మే 3 వరకు పొడిగించింది. అప్పటికీ కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోవడంతో రైళ్ల రద్దును జూన్‌ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పడు దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న వేళ మరోసారి రెగ్యులర్‌ ప్యాసింజర్‌ రైలు సర్వీసుల రద్దు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో లాక్‌డౌన్‌ మూలంగా పలు చోట్ల చిక్కుకున్న వలస కూలీలను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లతో పాటు కొన్న స్పెషల్ రైళ్లు మాత్రం యథాతథంగా నడుస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: