అప్పట్లో మహిళల అక్రమ రవాణా సహా పలు పలు వ్యభిచార ఆరోపణల కింద ఎంతో మంది అరెస్టు అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల నుంచి ఉపాధి నిమిత్తం వచ్చిన యువతులకు వలపన్ని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపిన  ఘటనలు అప్పట్లో సంచలనం గా మారిపోయాయి. అయితే అటు పోలీసులు కూడా ఇలాంటి ఘటనల పై ఉక్కుపాదం మోపి ఎంతో మంది నిందితులను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఆ మధ్య పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది ఇలాంటి ఘటన. 

 


 అప్పట్లో ఎన్నో రోజుల పాటు సంచలనం సృష్టించిన ఈ సెక్స్ రాకెట్ ఆ తర్వాత ఎక్కడ తెరమీద కనిపించకుండా మాయమైపోయిన విషయం తెలిసిందే, అయితే ఈ కేసులో మంత్రులు ప్రజా ప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు... ఇలా బడా బడా నాయకులు అధికారుల దగ్గరికి ఏకంగా మహిళలను పంపించే ఇటువంటి ఒక ముఠా. అయితే ఊహించని విధంగా ఈ ముఠా పోలీసులకు పట్టుబడింది. ఈ ముఠా నుంచి ఎంతగానో సమాచారం కూడా బయట పడుతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఆ తర్వాత కాలంలో వీరు కనుమరుగైపోయారు. 

 


 ఇక ఆ తర్వాత గవర్నమెంట్ మారింది కాబట్టి.. ప్రస్తుతం గతంలో జరిగిన ఈ ఘటన పై ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశారు అధికారులు. అయితే అప్పుడు మధ్యప్రదేశ్లో మాయమైనటువంటి ఈ ముఠాకు చెందిన నిందితుడు ప్రస్తుతం గుజరాత్లో పట్టుబడ్డాడు. మహేంద్ర సోనీ అనే వ్యక్తి హమీద్ జిల్లా గుజరాత్లో పట్టుబడ్డాడు. అక్కడ గుజరాత్లో తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటున్నాడు. ఒక క్లబ్ అనే పేరుతో  ఇతర దేశాలు రాష్ట్రాలనుంచి వచ్చినటువంటి అమ్మాయిలను.. వ్యభిచార కూపం వృత్తిలోకి దించడం.. ఆ తర్వాత వారికి లక్సరీ అనేటువంటి ఆశలు చూపి.. బెదిరింపులకు పాల్పడి ప్రజాప్రతినిధుల దగ్గరికి పంపించడం లాంటి ఘటనలు జరిగాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి ముఖ్య నిందితుడు పట్టుబడ్డాడు,

మరింత సమాచారం తెలుసుకోండి: