కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత వారం రోజుల నుండి వందకు పైగా కేసులు నమోదుకాగా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 150కేసులు నమోదుకాగా ఓ మరణం కూడా  సంభవించింది. కాగా ఈరోజు మరో 65 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం 3876కేసులు నమోదుకాగా అందులో 1846కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 2006మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 22 మంది మరణించారు. 

ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో ఈఒక్క రోజే 3645 రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి. ఆరాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 74622కు చేరింది. ఇక కర్ణాటక లో ఈరోజు 445కేసులు నమోదుకాగా ఆంధ్రప్రదేశ్ లో 605కేసులు నమోదయ్యాయి అలాగే తెలంగాణలో ఈరోజు  కొత్తగా 985 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈఒక్క రోజే 18000కు పైగా కేసులు నమోదుకావడం గమనార్హం. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో 509000కరోనా కేసులు నమోదుకాగా 15000కు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: