ప్రస్తుతం టిక్ టాక్ భారతదేశంలో మరింత ఎక్కువగా నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నెటిజనులందరికీ ఎక్కువ  ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న టిక్టాక్ మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ టిక్ టాక్ యూస్ చేస్తున్నా వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారతదేశంలో టిక్ టాక్ బాయికాట్  చేయాలని నినాదం వైరల్ అవుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం నెటిజన్లు టిక్ టాక్ ని వదిలెందుకు  అంతగా ఇష్టపడటం లేదు. అయితే ఇది తద్వారా ఎంతో మంది తమ టాలెంట్ను నిరూపించుకోని ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు కొట్టేసిన వాళ్లు  కూడా చాలామంది ఉన్నారు. 

 


 టిక్ టాక్ ద్వారా సినిమా ఛాన్సులు కొట్టేసి లైఫ్ సెట్ చేసుకున్న వాళ్లు ఏమో గాని.. టిక్ టాక్ ద్వారా లైఫ్ పాడు చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా రిస్కీ స్టంట్ లు చేస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకోవడం లేదా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం.. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు చాలానే చూశాం. ఏకంగా కట్టుకున్న వాళ్లని వదిలి పెట్టడానికి సిద్ధపడ్డారు  తప్ప టిక్ టాక్ మాత్రం వదలడానికి సిద్ధపడలేదు. ఇక తాజాగా టిక్టాక్ లో మరో వివాదం బయటపడింది. వీటి ప్రభావం నెటిజన్ల  పై ఏకంగా హత్యలు చేసుకునేంత వరకు వెళ్ళింది. 

 


 తాజాగా ఉత్తర ప్రదేశ్లో ఈ దారుణమైన ఘటన జరిగింది. టిక్ టాక్ లో బాగా  ఫేమస్ అయిన నయన కౌర్ అనే  అమ్మాయి వరుసగా వీడియోలు చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నది . ఈ క్రమంలోనే ఓ వ్యక్తి నయన కౌర్ ని  లవ్ చేస్తున్నాను నువ్వు మెసేజ్ పెట్టే వాడు కానీ ఆ తర్వాత సదరు యువతికి పెళ్లయిందని తెలుసుకుని ఉన్మాదిగా  మారిపోయాడు, ఆ యువతి షాపింగ్ మాల్ లో ఉన్న సమయంలో ముసుగుతో వెళ్లి ఆ యువతిపై ఏకంగా 40 కత్తి పోట్లు పొడిచి చంపేశాడు, అడ్డు వచ్చిన అక్కడ జనాలను కూడా కత్తితో పోట్లు పొడిచాడు నిందితుడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: