ఈ మద్య మానవ సంబంధాలు దారుణంగా తయారవుతున్నాయి. కేవలం తుచ్ఛమైన కోరికల కోసం కట్టుకున్న భార్యను అతి దారుణంగా చంపుతున్నారు కొంత మంది భర్తలు.  ఇక ప్రియుడి మోజులో పడి మూడు ముళ్లు వేసిన భర్తను దారుణంగా హత్యలు చేస్తున్న దారుణ ఘటనలు వెలుగు లోకి వచ్చాయి. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని కొంత కాలం తర్వాత భార్యా భర్తల మద్య వివాహేతర సంబంధాలతో ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. తాజాగా క‌ర్ణాట‌క‌లోని మైసూర్ లో దారుణం జ‌రిగింది.   ఓ భార్య త‌న ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను ఘోరంగా చంపింది. కేఆర్ న‌గ‌ర్ కు చెందిన శార‌ద‌, ఆనంద్ కు కొన్నేళ్ల క్రితం వివాహ‌మైంది. వివాహం జరిగిన కొత్తలో వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.. కానీ కొంత కాలం తర్వాత భార్యభర్తల మద్య అభిప్రాయ భేదాలు వచ్చాయట.  

 

శార‌ద‌కు బాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే ఆనంద్ కు అనుమానం వ‌చ్చి భార్య‌ను నిలదీశాడు. త‌మ సంబంధానికి అడ్డు వ‌స్తున్నాడ‌ని భావించిన భార్య‌.. భ‌ర్త‌ను చంపాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో ప్రియుడు బాబుతో క‌లిసి ఆనంద్ ను చంపింది. బాబు గొడ్డ‌లితో ఆనంద్ త‌ల‌పై బాదాడు. ఆ త‌ర్వాత ఘ‌ట‌నాస్థ‌లి నుంచి 2 కిలోమీట‌ర్ల దూరం బైక్ పై తీసుకెళ్లి.. ఆనంద్ డెడ్ బాడీని రోడ్డు ప‌క్క‌కు వ‌దిలారు. ఈ హత్యని కాస్త రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కన్నింగ్ ప్లాన్ వేశారు.  

 

అయితే యాక్సిడెంట్ కేసులు ఇటీవ‌ల న‌మోదు కాక‌పోవ‌డంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. లోతుగా ద‌ర్యాప్తు చేయ‌డంతో.. నేరం చేసిన‌ట్లు శార‌ద‌, బాబు అంగీక‌రించారు. వీరిద్ద‌రిని రిమాండ్ కు త‌ర‌లించారు పోలీసులు. కేవలం క్షణికమైన కోరిక తీర్చుకునేందుకు కట్టుకున్న భర్తను హత్యచేసిన ఆమెకు కఠిన శిక్ష వేయాలని బంధువులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: