స్నేహితులు అని నమ్మిన పాపానికి ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఘోరంగా అవమానం పాలు కావడమే కాదు.. అత్యాచారానికి గురైంది. గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆమె సహ విద్యార్థులు మాయ మాటలు చెప్పి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు. ఆమెపై లైంగిక దాడి చేసే సమయంలో వీడియో తీశారు. ఆ తర్వాత విద్యార్థిని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ఆరంభించారు. తమ కోరిక తీర్చుకున్నా.. డబ్బులు ఇవ్వకుండా ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడం మొదలు పెట్టారు.
రోజురోజుకు వారి వేధింపులు ఎక్కువ అవడంతో.. భరించలేక పోయిన బాధితురాలు తన కుటుంబసభ్యులకు అసలు విషయం చెప్పింది. దీంతో వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం గురించి పూర్తిగా తెలుసుకున్న దిశ పోలీసులు వెంటనే స్పందించి ఈ ఘాతుకానికి పాల్పడ్డ కౌశిక్, వరుణ్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ విద్యార్థిని నమ్మించి మోసం చేసి మత్తు మంది కలిపి తామే అత్యాచారం చేసినట్లు వారు తెలిపినట్లు సమాచారం. అయితే ఈ సంఘటన మూడేళ్ల కిందట జరిగినట్టు సమాచారం. శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. తామేదో గొప్ప పని చేస్తున్నట్లు ఆ దారుణం కాస్త వీడియో తీసి ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థిని బెదిరించడం.. ఆమె జీవితాన్ని నాశనం చేస్తామని బెదిరించారు.
మూడేళ్ల తర్వాత తాజాగా ఆమె వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ వేధింపులకు దిగారు. ఈ నేపథ్యంలో దిశ పోలీసులు అమ్మాయికు వారి కుటుంబ సభ్యులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.. ఎవరిని పడితే వారిని నమ్మి ఒంటరిగా వెళ్లడం చాలా తప్పని, ఇలాంటి దుర్మార్గులు ప్రతిచోట ఉన్నారని హెచ్చరించారు.