హైదరాబాద్ నగరం మల్కాజ్ గిరి ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాల పేరుతో మహిళపై మాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దెయ్యం పట్టిందని మహిళా భర్తకు మాంత్రికుడు చెప్పడంతో...మాంత్రికుడు మాటలు విని భార్యను పంపాడు భర్త. దీంతో మాంత్రికుడు ఆమెకు మత్తుమందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం గ్రహించిన భార్య భర్తకు ఆ మాంత్రికుడు చేసిన నిర్వాకం గురించి చెప్పింది. అయితే భార్య మాటలను పట్టించుకోలేదు భర్త. దీంతో విసుగు చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంత్రగాడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

IHG

వివరాల్లోకి వెళితే మల్కాజిగిరి లో నిందితుడు యూసఫ్ ఖాన్ దెయ్యాలను వదిలించే మాంత్రికుడిగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడట. తాయత్తులు కడుతూ దెయ్యం పట్టిన మహిళలకు వదిలిస్తాడట. దీంతో ఆ భర్తమంత్ర గాడి గురించి విని...అతని సంప్రదించి తన భార్య ఈ మధ్య కొద్దిగా మానసికంగా దెబ్బతిందని కొన్ని లక్షణాలు చెప్పగా ఆ మాంత్రికుడు దెయ్యం పట్టిందని వెంటనే తన దగ్గరికి తీసుకురావాలని తెలిపారట.

IHG

ఆ టైంలో భార్యతోబాటు రాకూడదని భర్తకు చెప్పడంతో భర్త ఇంటి కాడే ఉన్నాడట. తన దగ్గరికి వచ్చిన భార్యకి మంత్రము అని చెప్పి మత్తు ఇచ్చి ఆమె పై అత్యాచారం చేయడం జరిగిందట. దీంతో ఆ తర్వాత మత్తు నుండి తేరుకుని విషయం మొత్తం తెలుసుకొనీ భర్తకు చెప్పిన ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో ….బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఈ మాంత్రికుడు ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: