దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'పంజా' సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. కనీవినీ ఎరుగని రీతిలో ఆ చిత్రం ఆడియో ఫంక్షన్ అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకుంది. అలాగే భారీ అంచనాల మధ్య 'పంజా' సినిమా రిలీజ్ అయింది. తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. కానీ ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనరిజం చేసిన ఫైట్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

IHG

తాజాగా మరోసారి 'పంజా' సినిమా మరో తీపి జ్ఞాపకాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులకు అందజేసింది. అది ఏమిటంటే అప్పట్లో పంజా ఆడియో వేడుక జరుగుతున్న టైములో కొంతమంది అభిమానులు నేరుగా పవన్ కళ్యాణ్ ని వేదికపై కలుసుకోవడం జరిగింది. వారిలో పృద్వి తేజ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. టైములో పృథ్వీ తేజ IIT JEE లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దీంతో స్వయంగా పవన్ కల్యాణే పృథ్వి తేజ ని సత్కరించి అభినందించారు.

IHG

పృద్వి మరింత పై స్థాయికి ఎదగాలని పవన్ కళ్యాణ్ వేదికపై ఆకాంక్షించారు. కాలగర్భంలో కట్ చేస్తే తొమ్మిది సంవత్సరాలు అయింది తాజాగా మదనపల్లిలో సబ్ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ కలెక్టర్ లతో భేటీ అయిన సందర్భంలో వారిలో పవన్ కళ్యాణ్ అభిమాని పృథ్వి తేజ కూడా ఉండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: