సంక్షోభం లోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగిపోకుండా వైయస్ జగన్ చేస్తున్న పరిపాలనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ముఖ్యంగా మహమ్మారి కరోనా వైరస్ కట్టడి చేయడంలో దేశంలో చాలా వరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చేతులెత్తేస్తే వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రంలో జరుగుతున్న నిర్ధారణ పరీక్షలకు చాలావరకు వైరస్ కంట్రోల్ అయిన పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా ఎక్కడా కూడా కమ్యూనిటీ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందకుండా వైయస్ జగన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కరోనా పరీక్షలు పెరిగే లాగా నిర్ణయాలు తీసుకోవటం మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా ఒక వైపు సంక్షేమం అందిస్తూనే మరోవైపు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి జన్మదినం జూలై 8 వ తారీకు నాడు రాష్ట్రమంతటా అదిరిపోయే రేంజ్ లో జరగాలని సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే జులై నెల స్టార్టింగ్ లోనే వైయస్సార్ అంబులెన్సులు 104-108 నెంబర్ లపై ప్రారంభం కానుండగా…. రాజశేఖర్ రెడ్డి స్మారకంగా ప్రతి ఏడాది జూలై 8న రైతు దినోత్సవం జరపాలని జగన్ డిసైడ్ అవ్వడం జరిగింది. తన తండ్రికి రైతులంటే ఎంత ఇష్టమో వ్యవసాయానికి ఎన్ని మేలు చేశారు అన్ని విషయాలను బేరీజు వేసుకుని వైయస్ జన్మదినోత్సవాన్ని 'రైతు దినోత్సవం' గా జగన్ ప్రకటించడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.