ఏపీ సీఎంగా జగన్ తొలి ఏడాది పాలన పూర్తయింది. అయితే మొదటి ఏడాదిలోనే అనేక సంక్షేమపథకాలను దిగ్విజయంగా అమలుచేశారు జగన్ మోహన్ రెడ్డి. కరోనా కష్టకాలం కూడా ‘వైయస్‌ఆర్‌ రైతు భరోసా, వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక, వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ, వైయస్‌ఆర్‌ వాహన మిత్ర, వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా, వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం, వైయస్‌ఆర్‌ కాపు నేస్తం, వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, వైయస్‌ఆర్‌ కంటి వెలుగు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలు అమలు చేశారు.

 

 

అయితే జగన్ పాలనలో.. తొలి ఏడాది లోనే రూ.41 వేల కోట్లతో 4 కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు ఆ పార్టీ యువ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి. కరోనా విపత్తులోనూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, నేడు ఎంఎస్‌ఎంఈలకు రీస్టార్ట్‌ ప్యాకేజీ ద్వారా రెండవ విడత రాయితీ బకాయిలు చెల్లించి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు జీవం పోశారని ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు.

 

 

సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వమే ఆంధ్రప్రదేశ్‌ బలమన్నారు అబ్బయ్య చౌదరి. తన సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన లక్ష్యాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయించుకున్నారన్నారు. నవరత్నాల ద్వారా ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందించి ఏపీ సోషల్‌ రిఫార్మర్‌ సీఎం వైయస్‌ జగన్‌ అని గుర్తుకువచ్చే విధంగా తొలి ఏడాది పాలన సాగిందన్నారు.

 

 

కేవలం సంక్షేమ పథకాలే కాకుండా.. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కృషిచేస్తున్నారని అబ్బయ్య అన్నారు. రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద ఎంఎస్‌ఎంఈలకు రూ.512 కోట్లు విడుదల చేశారన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న సుమారు 97,428 ఎంఎస్‌ఎంఈలను రీస్టార్ట్‌ ప్యాకేజీ ద్వారా ఆదుకున్నారని, అంతేకాకుండా మూడు నెలల విద్యుత్‌ ఫిక్డ్స్‌ చార్జీలను కూడా మాఫీ చేశారన్నారని గుర్తు చేశారు అబ్బయ్య.

 

మరింత సమాచారం తెలుసుకోండి: