దేశంలో కరోనా విజృభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించడం వలన చాల మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అందువల్ల పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.

 

 

ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లకు ముఖ్యమైన గమనిక. ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావించే వారు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ విత్‌డ్రా రూల్స్‌ను సవరించిందన్నారు. సులభంగానే పీఎఫ్ డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు.

 

 

అయితే ఇప్పుడు ఈ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చునన్నారు. కరోనా వైరస్ ఆప్షన్ కింద పీఎఫ్ డబ్బుల విత్‌డ్రాకు జూన్ 30 డెడ్‌లైన్‌గా ఉందన్నారు. అంటే ఈరోజుతో ఈ విత్‌డ్రా సౌకర్యం గడువు ముగియనుందన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకొని వారు వెంటనే ఆ పని పూర్తి చేసుకోవడం మంచిదన్నారు.

 

 

రేపటి నుంచి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ఏదో ఒక కారణం చెప్పాల్సి ఉంటుందన్నారు. దీనికి మళ్లీ డాక్యుమెంట్లు కూడా అందించాలని తెలిపారు. అందువల్ల వల్ల ఈరోజే పీఎఫ్ డబ్బులు కోసం అప్లై చేసుకుంటే మంచిదన్నారు. కరోనా వైరస్ ఆప్షన్ కింద ఎలాంటి డాక్యుమెంట్లు అందించకుండానే డబ్బులు తీసుకోవచ్చునన్నారు. అది కూడా కేవలం 3 రోజుల్లోనే మీ పీఎఫ్ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌కు వచ్చి చేరతాయని తెలిపారు.

 

 

పీఎఫ్ అకౌంట్ కలిగిన వారు కరోనా ఆప్షన్ కింద 3 నెలల బేసిక్ శాలరీ, డీఏ లేదా పీఎఫ్ అకౌంట్‌లో జమైన 75 శాతం మొత్తంలో ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. పే స్లిప్ లేదా శాలరీ స్లిప్‌లో బేసిక్ వేతనం, డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) వివరాలు ఉంటాయి. వీటి ఆధారంగా మీకు ఎంత పీఎఫ్ డబ్బు వస్తుంతో చూసుకోవచ్చునని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: