కర్ణాటక రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కన్న కూతురిని మోహించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అందుకు అతడి పెళ్ళాం కూడా పట్టించుకోకపోవడంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బెంగళూరు లోని హరలూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతి తన తండ్రి, సవితి తల్లి తో కలిసి జీవనం కొనసాగిస్తుంది. ఇక ఇదే సమయంలో కన్న తండ్రి కూతురు పై కన్నేశాడు. 

 


అయితే ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయికి కాస్త దగ్గు, జలుబు ఉండడంతో మంగళవారం నాడు ఆ విషయాన్ని తండ్రికి తెలిపింది. అయితే ఆ కసాయి తండ్రి దగ్గుమందు పేరుతో నిద్రమాత్రలు ఇచ్చాడు. అవి మత్తు మందు కు సంబంధించిన మాత్రలు అని తెలియక పోవడంతో ఆ అమ్మాయి ఆ మాత్రలు వేసుకుంది. దీంతో కొద్దిసేపటికి మైకం కమ్మి విపరీతమైన నిద్ర లోకి వెళ్లి పోయింది. ఇక అంతే నిద్రలోకి జారుకున్న కూతురిపై తండ్రి తన మూర్ఖత్వాన్ని బయటకు తెచ్చాడు. తన కూతురు అనే జాలి లేకుండా నీచంగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే మరుసటి రోజు ఉదయాన్నే లేచి చూసేసరికి తన పక్కన పడుకొని ఉండడం తన దుస్తులు వాలకం చూసుకొని ఆమె షాక్ అయింది. తన తండ్రి ఆమెపై అత్యాచారం చేశాడని గ్రహించి తండ్రి చేసిన పాపపు పనిని తన సవతి తల్లి తో చెప్పుకొని బోరుమని వినిపించింది.

 


అయితే ఈ విషయాన్ని సవతి తల్లి అంతగా పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ యువతి టాయిలెట్ క్లీనింగ్ కు వాడే మందు తాగేసింది. ఆ తర్వాత అదే పరిస్థితుల్లో దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై ఫిర్యాదు అందించి అక్కడికి అక్కడే కుప్పకూలిపోయింది. దీంతో పోలీసులు వెంటనే ఆమెను సెయింట్ జాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని తండ్రి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: