మనుషులు ఎంత దారుణంగా తయారవుతున్నారు అంటే మృగాలకంటే దారుణంగా మారుతున్నారు. ముగా జీవాలను చిత్రహింసకు గురి చేస్తున్నారు. వాటి పట్ల ఎంతో క్రూరంగా కఠినంగా ప్రవరిస్తున్నారు. మొన్నటికి మొన్న కేరళలో పైనాపిల్ లో బాంబులు పెట్టి ఏనుగును చంపినా ఘటన జరిగింది. ఇంకా ఇప్పుడు అచ్చం అలానే పైనాపిల్ లో నాటు బాంబు పెట్టి ఆవుకు పెట్టిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

 

IHG

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరులోని పెద్దపంజాని మండలం కోగిలేరు సమీపంలో ఓ ప్రైవేటు సంస్థవారు గో పీఠన్ని నడుపుతున్నారు. దీంతో ఇంకా అక్కడ ఉన్న అడవి జీవాల కోసం నీళ్లు ఆహారాన్ని ఏర్పాటు చేసి వన్యప్రాణులకు నివాసం లా ఏర్పాటు చేసారు. అయితే ఆ జంతువుల కోసం కొందరు వేటగాళ్లు అక్కడికి వస్తుంటారు. 

 

IHG

 

అక్కడికి వచ్చే అడవి పందుల కోసం నాటు బాంబులను, తుపాకులను తయారుచేసుకుని వేటాడుతున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే పైనాపిల్‌లో బాంబులు పెట్టి వాటికి ఎర వేశారు. ఇంకా ఈ సమయంలోనే గో పీఠంలో ఓ ఆవుకు వేటగాడు పెట్టిన పైనాపిల్ కనిపించింది. దీంతో ఆ పైనాపిల్ ని ఆవు నోటితో కొరికింది. 

 

IHG

 

ఈ పేలుడు దెబ్బకు ఆవు దవడ క్రింది బాగం పూర్తిగా దెబ్బతింది. స్థానిక డాక్టర్లు ఆ ఆవుకు మూడు రోజుల పాటూ వైద్యం అందించారు. కానీ దవడ భాగం, నాలుకకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్సపొందుతూ ఆవు చనిపోయింది. మరోవైపు నాటు బాంబులు పెట్టిన వేటగాళ్లతో పాటూ తయారు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: