గత కొన్ని రోజులుగా భారత్ - చైనాల మద్య జరుగుతున్న వివాదం అందరికీ తెలిసిందే.  తాజాగా ఈ నేపథ్యంలో చైనాకి సంబంధించిన యాప్స్ నిషేదించారు. అంతే కాదు చైనా వస్తువులను కూడా బహిష్కరిస్తున్నారు. ఇక భారతీయులు ఎంతగానో ఇష్టపడే టిక్ టాక్ నిషేదించడంతో కొంత మంది ఇబ్బందులు పడుతున్నారని టాక్ వినిపిస్తుంది. కానీ ఇది చైనా యాప్ ని దీన్ని ముమ్ముటికి నిషేదించాలని ప్రతి భారతీయుడు అంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ టిక్ టాక్ నిషేదంపై  సంచలన వ్యాఖ్యలు చేశారు.  టీఎంసీ ఎంపీగా ఉన్నా సరే.. కేంద్ర ప్రభుత్వ పలు నిర్ణయాన్ని సమర్ధించి వార్తలకెక్కిన ఈమె...ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.

IHG

టిక్ టాక్ యాప్ నిషేదం  కేంద్రం తీసుకున్న తొందరపాటు చర్యగా ఆమె అభివర్ణించారు.  చైనా దేశపు టిక్ టాక్ యాప్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్  మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.  కోల్‌క‌తాలో ఇస్కాన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన శ్రీకృష్ణ ర‌థ‌యాత్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నుస్ర‌త్ జ‌హాన్ అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా టిక్‌టాక్ నిషేధం నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టారు.

IHG

 టిక్‌టాక్ అనేది వినోదాన్ని పంచే ఒక అప్లికేష‌న్‌. ఆ యాప్‌పై నిషేధం విధించడంలో కేంద్రం తొంద‌ర‌ప‌డింది. ఈ నిషేధంవ‌ల్ల దేశంలో జ‌రిగే న‌ష్టాన్ని పూడ్చుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌రున్న వ్యూహాత్మ ప్ర‌ణాళిక ఏమిటి? టిక్‌టాక్‌పై నిషేధం వ‌ల్ల ఉపాధి కోల్పోయిన వారి ప‌రిస్థితి ఏమిటి? ఒక‌ప్పుడు నోట్ల ర‌ద్దు వ‌ల్ల ఇబ్బందులు ప‌డిన‌ట్లే, ఇప్పుడు టిక్‌టాక్‌పై నిషేధంవ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. దేశ‌భ‌ద్ర‌త‌కు సంబంధించిన విష‌యం కాబ‌ట్టి టిక్‌టాక్‌పై నిషేధంవ‌ల్ల నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదని అన్నారు. తాను లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రు స‌మాధానం చెబుతారు అని నుస్ర‌త్ ప్ర‌శ్నించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: