ప్రేమ అనేది రెండు అక్షరాలు. కానీ అందులో అనుభూతులు మరెన్నో. ప్రేమ కోసం యుద్దాలు చేసిన రాజులు ఉన్నారు. అదే ప్రేమ కోసం చనిపోయిన వీరులు ఉన్నారు. వారి ప్రేమ కానుకగా ఒక్కరు తజ్ మహల్ కట్టిస్తే మరొక్కరు భాగ్య నగరాన్ని నిర్మించారు. ప్రేమకు భాష లేదు భావం ఒక్కటే ఉంది.

 

 

ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. ప్రేమకు మతం లేదు. ప్రేమ అనేది ఇద్దరినీ ఒక్కటి చేసింది. అదే ప్రేమ అయినా వారిని కానివారిలా చూస్తుంది. అదే ప్రేమ కానీ వారిని అయినా వారిలా చూపిస్తుంది. ప్రేమ కోసం పెద్దలను వదులుకున్న ప్రేమికులు ఉన్నారు. అదే ప్రేమ కోసం ప్రాణాలు వదిలిన ప్రేమికులు ఉన్నారు. అయితే తాజాగా అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది.

 

 

ప్రేమ పెళ్లి చేసుకున్న మూడు నెలలకే కొత్త జంట ఆత్మహత్య చేసుకుంది. ధర్మవరం లక్ష్మీచెన్నకేశవపురం కాలనీకి చెందిన శివశంకర్‌ గాంధీనగర్‌కు చెందిన గౌతమిని ప్రేమించాడు. కానీ ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. పెద్దల్ని ఎదురించి మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు తన తండ్రి మల్లికార్జున బదులు శివశంకర్ మున్సిపాలిటీలో డ్యూటీ చేస్తున్నాడు.

 


కాపురం సాఫీగా సాగిపోతున్న సమయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. విషయం గౌతమి తల్లిదండ్రులకు తెలియడంతో కూతురు, అల్లుడ్ని ఇంటికి పిలిచారు. ఇద్దరికి సర్థిచెప్పారు. మళ్లీ అక్కడ కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు. కొద్దిసేపటికి గౌతమి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

 


శబ్దం రావడంతో చూసిన శివశంకర్ భార్యను చూసి షాక్ తిన్నాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. భార్య చనిపోవడంతో షాక్ తిన్న శివశంకర్ నేరుగా రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు.పెళ్లైన మూడు నెలలకే యువ జంట ప్రాణాలు తీసుకోవడం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: