ఈ మద్య కొంత మంది తమకు గిట్టని వాళ్లను.. తమతో వైరం పెట్టుకున్న వాళ్లను విచక్షణారహితంగా హత్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కుటుంబ నేపథ్యంలో వచ్చే గొడవల్లో కూడా ఇలాంటి హత్యాకాండ జరుగుతున్నాయి.  క్షణికావేశం.. తామేం చేస్తున్నామన్న కనీస జ్ఞానం లేకుండా అత్యంత పాశవికంగా తన మాజీ ప్రియురాలిని హత్యచేశాడు ఓ ప్రియుడు.  కొంత కాలంగా ప్రేమించుకున్న ఈ జంట ఈ మద్య విడిపోయారు.. తనను కాద‌ని ఇంకొక‌రిని వివాహం చేసుకున్నందుకు ఆమెపై ప‌గ పెంచుకున్నాడు. కూర‌గాయ‌ల‌కు వ‌చ్చిన ఆమెపై విచ‌క్ష‌ణార‌హితంగా క‌త్తితో పొడిచి చంపాడు. 

 

జునాగ‌ఢ్ జిల్లాకు చెందిన భావ‌న‌(30)ను కొన్నేళ్ల క్రితం సంజయ్ ప‌ర్విన్ అనే యువ‌కుడు ప్రేమించాడు. అయితే పెద్దలకు తెలియకుండా వీరి ప్రేమ వ్యవహారం కొంత కాలంగా బాగానే నడిచింది. కానీ ఆమె తన పెద్దల మాట వినాల్సి వచ్చింది.. ఎదరు చెప్పలని పరిస్థిలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతే తాను ఎంతగానో ఇష్టపడ్డ ప్రియురాలు తనకు సొంతం కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న అక్కసు  సంజ‌య్ ప‌గ పెంచుకున్నాడు.  ఆమెను ఎలాగైనా అంత‌మొందించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. కొద్ది రోజుల నుంచి భావ‌న క‌దిలిక‌ల‌ను సంజ‌య్ గ‌మ‌నిస్తున్నాడు.  ఈ నేపథ్యంలో ఆమె స్థానికంగా ఉన్న కూర‌గాయ‌ల మార్కెట్ కు వ‌చ్చింది.

 

ఇక భావనను మెల్లిగా తెలియకుండా వెంబడించడం మొదలు పెట్టాడు. తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో ఆమెపై ఒక్క‌సారిగా క‌త్తితో దాడి చేశాడు. సుమారు ప‌దిసార్లు క‌త్తితో పొడిచాడు.  అంతే ఒక్కసారిగా ఆమెపై జరిగిన దాడితో అక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. ఉన్మాదిగా మారిపోయిన సంజయ్ భావన మృత‌దేహం ప‌క్క‌నే కూర్చుండి ఉండిపోయాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భావ‌న సోద‌రుడి ఫిర్యాదు మేర‌కు జునాగ‌ఢ్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: