మనుషులు ఎంత దారుణంగా మారుతున్నారు అంటే చెప్పకూడదు లెండి. రోజు రోజుకు అతి దారుణంగా తయారవుతున్నారు. వస్తువు చిన్నదైనా.. పెద్దదైన ఊరికే వస్తుంది అంటే ఎంతకైనా తెగిస్తారు అనేది ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది. బంగారు ముక్కు పుడక కోసం పూడ్చిన శవాన్ని మళ్లీ బయటకు తీశాడు కాటికాపరి. 

 

IHG

 

ఇంకా ఈ దారుణమైన ఘటన తెలంగాణలోని మెదక్ పట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోల్కొండ వీధికి చెందిన కొప్పుల పోచమ్మ అనే 80 ఏళ్ళ వృద్ధురాలు గత నెల 24న అనారోగ్యంతో మరణించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు సంప్రదాయం ప్రకారం గిద్దకట్ట శ్మశాన వాటికలో పూడ్చి పెట్టారు. 

 

IHG

 

అయితే పోచమ్మ మృతదేహాన్ని పూడ్చిపెట్టే సమయంలో ఆమె ముక్కుకు ముక్కు పిడకలు ఉండటం గమనించాడు కాటికాపరి. దీంతో పోచమ్మ కుటుంబ సభ్యులంతా ఇంటికి వెళ్ళాక ముక్కుపుడక కోసం పూడ్చిన శవాన్ని మళ్లీ బయటకు తీశారు. ఇంకా ముక్కుపుడకలు తీసుకొని పూడ్చిపెట్టాలి అని అనుకున్న సమయంలో అటువైపుగా వెళ్తున్న కొందరు గమనించారు. 

 

IHG

 

దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంకా ఈ విషయం మృతురాలి కొడుకు ఊశయ్యకు తెలియడంతో అతను కాటికాపరిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. అయితే ముక్కు పుడక కోసమే శవాన్ని తవ్వడం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: