దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకీ చాపకింద నీరులాగా విజృంభిస్తుంది. దీనితో ప్రజలు అందరూ కూడా దాదాపు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక మరోవైపు అన్ని రకాల ఇండస్ట్రీలో వారు కూడా ఇంట్లోనే ఉంటూ వారి సమయాన్ని గడిపేస్తున్నారు. ఇక ప్రముఖ హీరోలు హీరోయిన్లు కూడా సినిమాలు, షూటింగ్ లు  ఏమీ లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడిపేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్లే పరిస్థితి ఉండక పోవడంతో అందరూ కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు కానీ.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక హీరోయిన్ సాహసం చేసింది.

 

నటి కంగనా రనౌత్ తన కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్ కు వెళ్లడం జరిగింది.  ఈ లాక్ డౌన్ సమయం అంతా కూడా ఎక్కువగా కంగనా కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయాన్ని కేటాయించింది. అంతే కాకుండా మరో వైపు కొన్ని సినిమాల కథలు వింటూ తన డైరెక్ట్ చేయబోయే సినిమాలో కూడా మొదలు పెట్టే ప్రయత్నాలు చేసింది. ఇక ఈ గ్యాప్ లోనే తన ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ తీసుకుని ఒక పిక్నిక్ కు వెళ్ళింది. ఇక ఈ విషయాన్ని కంగనా రనౌత్ సోదరి అయిన రంగోలి చందా ల్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని అభిమానులతో పంచుకుంది. 

 

 


నిజానికి మా తల్లిదండ్రుల కోరిక కోరడంతో కంగనా ఫ్యామిలీ పిక్నిక్ చేసింది అని ఆమె తెలియచేసింది. అంతేకాకుండా వర్షాకాలం మొదలు అవ్వకముందే మా తల్లిదండ్రులు సమ్మర్ అవుట్ డోర్ ను ఎంజాయ్ చేయాలనుకున్నారు. ఇక మేము గ్రీన్ సాంగ్ ప్రాంతంలో ఉన్న కూడా పిక్నిక్ కు వెళ్లేందుకు పర్మిషన్ తీసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలియజేసింది. ఇక మాకు ఇలా పిక్నిక్ కు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు అందరికీ కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా వేదికగా చేసుకొని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: