ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నాడు. తాజాగా జగన్ సర్కార్ 1,088 అంబులెన్సులను ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకై కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ నగరంలో వీటిని జగన్మోహన్ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఈ వార్త దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సంచలనం అయ్యింది. కరోనా వైరస్ ని అరికట్టడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న జాగ్రత్తలు, చేపడుతున్న చర్యలు దేశవ్యాప్తంగా ప్రశంసనీయంగా అభినందనీయం గా మారుతున్నాయి.
అతి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి తలపండిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే అద్భుతంగా పరిపాలన చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. 1088 ఆంబులెన్స్ వాహనాలను ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరూ అతనిని ఎంతో పొగిడారు. అయితే ఎప్పుడూ పరనింద ఆత్మస్తుతి గా భావించే రాజకీయాలు చోటు చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ఎప్పుడూ జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ ఈసారి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తెగ పొగిడేశాడు. ఈ పొలిటికల్ మూవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటి గా జరిగిందని చెప్పవచ్చు. అందుకే రాజకీయరంగంలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడని, మంచి చేస్తున్న రాజకీయ నేతలను మనస్ఫూర్తిగా అభినందించి ప్రజల మన్నలను పొందుతూ ఉన్నాడని తెలుస్తుంది.
Powered by Froala Editor