కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు మర్చి నెలలో లాక్ డౌన్ విధించాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్‌కు చెందిన డన్నా పారీ అనే 22 ఏళ్ళ మహిళ లాక్ డౌన్ ప్రకటించడంతో తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. 

 

IHG

 

అయితే ఆలా ఆమె ఇంటికి వెళ్లేముందు 210 రూపాయలతో కొన్న బంగాళదుంపలను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. సాధారణంగా బంగాళదుంపలను అలాగే వదిలేస్తే అవి మొలకలు వచ్చేస్తాయన్న సంగతి తెలిసిందే. ఇంకా అలాంటి బంగాళా దుంపలను ఆమె ఏకంగా మూడు నెలల పాటు వదిలేసి వెళ్ళింది. 

 

IHG

 

ఇంకేముంది మూడు నెలల తర్వాత ఆమె ఇంటికి తిరిగివచ్చింది. అయితే డోర్ తీసి కిచన్ లోకి వెళ్ళింది షాక్ అయ్యింది. గోడకు మొక్కల్లాంటివి కనిపించాయి. అవి దగ్గరకు వెళ్ళాక చూస్తే.. బంగాళా దుంపలకు మొలకలు వచ్చాయి. ఇంకా అది చుసిన ఆమె నవ్వి వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

 

IHG

 

ఇంకేముంది క్షణాల్లో వైరల్ అయ్యాయి ఆ ఫోటోలు. ఆమె ఆ ఫోటోలు పోస్ట్ చేస్తూ.. ''వాటిని చూడగానే హడలిపోయాను. కానీ, అవి ఏమిటో తెలిసిన తర్వాత నవ్వు ఆగలేదు. వెంటనే దాన్ని వీడియో తీసి స్నాప్ చాట్‌లో పెట్టా. దీంతో మా ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోయారు'' అంటూ ఆమె క్యాప్షన్ జోడించి ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు మీరు కూడా ఓసారి చుడండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: