దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎదో ఒక్క ప్రాంతంలో మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు కామాంధులు. వారి కామవాంఛ తీర్చుకోవడానికి చిన్న పిల్లల నుండి కాటికి కాలు చాపిన ముసలి వాళ్ళ దాక బలైపోతున్నారు. ఈ అఘాయిత్యాలను అరికట్టడానికి దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు అమలులోకి తీసుకొచ్చారు. అయినా వారిపై ఆగడాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.

 

 

పెళ్లితో రెండు కుటుంబాలు ఒక్కటి అవుతాయి. వివాహంతో రెండు మనసులు ముడిపడతాయి. అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది ఒక్క మలుపు. పెళ్లి చేసుకున్న అమ్మాయి తనకంటూ ఒక్క కుటుంబాని ఏర్పచుకొవాలని  ఎన్నో ఆశలను పెట్టుకుంది. కోటి ఆశలతో మెట్టింట్లో అడుగుపెట్టిన అమ్మాయి తన కళల ప్రపంచాన్ని కాదనుకొని తన భర్తే ప్రపంచం అనుకుంటుంది. అలాంటి ఒక్క వివాహితపై అత్యాచారం చేసిన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

 

 


వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాలో నవవధువుపై బంధువు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. సూళ్లూరుపేట మండంలోని ఓ గ్రామానికి చెందిన చెందిన యువకుడికి నాలుగు నెలల క్రితం వివాహమైంది. కొత్త దంపతులు గ్రామంలోని ఓ ఇంట్లో వేరు కాపురం ఉంటున్నారు. శనివారం భర్త పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లడంతో మహిళ ఒంటరిగా ఉంది. ఈ సంగతి తెలుసుకున్న బంధువుల కుర్రాడు ఇంటికి వెళ్లి ఆమెతో మాటలు కలిపాడు.

 

 

అదను చూసి ఆమెను గదిలోకి లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పారిపోయాడు. తనపై జరిగిన బలత్కారాన్ని తలుచుకుంటూ కుమిలిపోయిన బాధితురాలు రాత్రి ఇంటికొచ్చి భర్తకు విషయం చెప్పింది. దీంతో అతడు ఆదివారం సూళ్లూరుపేట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: