దేశంలో మళ్లీ కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడది అని తెలిస్తే చాలు కామంతో ఊగిపోతున్నారు. లైంగిక వేధింపులు.. అత్యాచారాలు.. హత్యలు ఇలా ఎంతో మంది అమాయక ఆడవారిపై దారుణాలు జరుగుతున్నాయి.  ఆ మద్య లాక్ డౌన్ సందర్భంగా ఈ క్రైమ్ రేట్ తగ్గినా... మళ్లీ మొదలైంది. వరుసగా అత్యాచారా, హత్య కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మొన్న తమిళనాట ఏడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అందరినీ కలిచి వేసింది. తాజాగా ఓ బాలికపై ముగ్గురు కామాంధులు ఏడాదిగా లైంగికదాడికి పాల్పడ్డారు. ఫలితంగా బాలిక గర్భం దాల్చడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం ఎలమంచిలి జిల్లా కొత్తలి గ్రామానికి చెందిన ఓ బాలిక(15) తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. ఆ బాలిక  తాతయ్య, అమ్మమ్మ వద్ద ఉంటోంది. బాలిక 9 వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. అమ్మమ్మ, తాతయ్యలు కూలి పనికి వెళ్తుండడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉండేది.  ఇదే అదునుగా భావించి ఆ బాలికపై ముగ్గురు కామాంధులు భయపెట్టి ఒకరి తర్వాత ఒకరు తమ కామ వాంఛ తీర్చుకోవడం మొదలు పెట్టారు. ఇలా ఏడాదిగా ఆ రాక్షసులు ఆ బాలికపై తమ కామ వాంఛ తీర్చుకుంటూ వచ్చారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. కొద్ది రోజులుగా ఆ బాలిక శరీరంలో మార్పులు రావడం అమ్మమ్మ గమనించింది.   

 

పొట్ట లావవుతుండడంతో గమనించిన ఆమె అమ్మమ్మ దవాఖానకు తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి ఆరు నెలల గర్భవతి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆ తరువాత బాలికను ప్రశ్నించగా అసలు గుట్టు బయటపడింది. బాలిక బంధువులు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిలో ఒకరు పెయింటర్ కాగా మరొకరు భవన నిర్మాణ కార్మికుడు ,ఇంకొకరు వ్యవసాయ కూలీ అని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: