ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న టైంలో అధికార పార్టీ టీడీపీ ని అనేక రీతులుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. స్పెషల్ స్టేటస్ అడ్డంపెట్టుకుని చంద్రబాబుకి మరియు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి చాలా తెలివిగా జగన్ గ్యాప్ వచ్చేటట్లు చేసి ఇద్దరి మైత్రి బంధాన్ని విడగొట్టడం జరిగింది. ఇదే సమయంలో తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 'ప్రత్యేక హోదా' తీసుకువస్తాను అంటూ ప్రజలకు హామీ ఇవ్వటం జరిగింది. సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ పార్టీ అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావడంతో …. ప్రత్యేక హోదా తీసుకు వస్తాను అని చెప్పిన జగన్… ప్రస్తుత పరిస్థితులను బట్టి వాళ్లకి స్పెషల్ స్టేటస్ గురించి గుర్తు చేయటం తప్ప చేసేది ఏమీ లేదని నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పేశారు.

 

ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించడం జరిగింది. ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్న టైంలో యూటర్న్ తీసుకున్నారని చంద్రబాబు ని విమర్శించారు… స్పెషల్ స్టేటస్ విషయంలో మీరు చేస్తుంది ఇప్పుడు ఏంటి అని అప్పట్లో టీడీపీ నేతలు ప్రశ్నించారు. జగన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇటువంటి తరుణంలో ప్రత్యేక హోదా విషయంలో ఇటీవల రాజ్యసభ ఎన్నికల టైంలో ఇద్దరూ వైసీపీ పార్టీ తరపున గెలిచిన వారిలో ఒక నేత subhash chandra BOSE' target='_blank' title='పిల్లి సుభాష్ చంద్రబోస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పిల్లి సుభాష్ చంద్రబోస్ మరోసారి 'ప్రత్యేక హోదా' గురించి మాట్లాడుతూ ఇక ఏపీకి స్పెషల్ స్టేటస్ కష్టమని తెలపడం జరిగింది.

 

ఇలాంటి తరుణంలో తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లు 'ప్రత్యేక హోదా' అంశాన్ని అడ్డంపెట్టుకుని జగన్ మీద సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయాన్ని పెద్ద ఎత్తున కాంట్రవర్సీ చేయాలని తెగ తాపత్రయ పడుతున్నారు. ఎలాగైనా స్పెషల్ స్టేటస్ అడ్డంపెట్టుకుని సుభాష్ చంద్ర బోస్ చేసిన వ్యాఖ్యలు తో జగన్ పార్టీని దెబ్బకొట్టాలని తెగ ఆరాటపడుతున్నారు. కాగా జగన్ ఇలాంటివి ఆశలు పట్టించుకోరని పెద్దగా కేర్ చెయ్యరు అని మరి కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: