పరువు హత్యలు మన భారతదేశంలో సర్వసాధారణం. ఎక్కడో ఒక చోటా ఈ పరువు హత్యలను మనం చూస్తుంటాం. ఇంకా ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలో కూడా ఒక పరువు హత్య జరిగింది. ఈ పరువు హత్య అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే పరువు హత్యకు గురైన మహిళా వయసు 44 ఏళ్ళు. 

 

IHG's the

 

అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురానికి చెందిన 44 ఏళ్ళ లలిత కుమారి జులై మూడోవ తేదీన అనుమాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక హత్యకు గురైందా అనే విషయం మిస్టరీగా మారింది. అయితే ఆమె మృతి పట్ల బంధువులెవరూ ఫిర్యాదు చెయ్యడానికి ముందుకు రాలేదు. 

 

IHG'honour killing' case in TN - DTNext.in

 

దీంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇంకేముంది షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. లలిత కుమారిని ఆమె సొంత బాబాయిలు, తాత కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. 

 

IHG

 

కాగా మృతురాలు భర్త నాగరాజు టీచర్‌గా పనిచేసేవాడు. అయితే ఇతను మే 18న ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి కుటుంబ సభ్యులు లలిత కుమారిపై కోపంతో ఉన్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఆమెను హత్య చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే భర్త ఆత్మహత్యకు.. ఈమె హత్యకు ఏమైనా సంబంధం ఉందా ? లేదా అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: