కాలక్రమేనా అతనికి ప్రభుత్వరంగంలో ఎటువంటి పదవులు దక్కకపోవడం అతన్ని కాస్తా బాధించిందని చెప్పుకోవచ్చు. 1989, 1994 సంవత్సరాల మధ్యలో ముఖ్యమంత్రి అవ్వాలనే తపనతో ఎంతో శ్రమపడి యత్నించినప్పటికీ దానికి అవకాశం మాత్రం అందనంత ఎత్తులో ఉండిపోయింది. అయితే 1999వ సంవత్సరంలో మళ్లీ శాసనసభకు ఎంపికైన వైయస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా దూసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని ఎంతగానో అభివృద్ధి చేసి వచ్చే ఎన్నికలలో అధికార పక్షంపై గెలిచేందుకు రాజకీయ వ్యూహం రచించి గొప్ప రాజకీయ నాయకుడిగా వెలుగొందారు.
2003వ సంవత్సరంలో ఎర్రటి ఎండలో 1467 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన పులివెందుల పులి బిడ్డ రాజశేఖర్ రెడ్డి... ఉచిత విద్యుత్ అందిస్తామని తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ప్రచారం చేస్తూ తెలుగు ప్రజలను ఎంతగానో ఆకర్షించారు. ఈ మండువేసవిలో చేసిన పాదయాత్ర అతని విజయానికి పూల బాట వేసింది అని చెప్పుకోవచ్చు. 2004వ సంవత్సరంలో పులివెందుల నియోజకవర్గం నుండి నలభై వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందిన వైయస్ రాజశేఖర్ రెడ్డి కి... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మెజారిటీ సంపాదించడం తో సీఎం పీఠం కాళ్ళ ముందు వచ్చి పడింది. ఆ తర్వాత తన పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
Powered by Froala Editor