అతని దగ్గర వైద్యం చేయించుకున్నవారు అదృష్టవంతులని అప్పట్లో ప్రజలు తెగ చెప్పుకునేవారు. మూడు పదుల వయసు రాకముందే వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచారు. పేద వారిని ఆదుకోవాలని తనలోని ఉండే తపన మెచ్చుకోదగ్గ గొప్ప విషయం. 1978 వ సంవత్సరం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవిని చేజిక్కించుకున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో కరువుతో కొట్టుమిట్టాడుతున్న రాయలసీమ వ్యధ ని చూసి తాను కేవలం రూపాయి మాత్రమే వేతనంగా తీసుకుంటానని మిగతా డబ్బులన్ని ప్రజల సంక్షేమం కొరకు వాడాలని సిఎంను కోరి తన గొప్ప హృదయాన్ని మళ్ళీ చాటుకున్నారు.
ఇకపోతే వైఎస్ఆర్ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాలను, డిగ్రీ కళాశాలను కూడా నిర్మించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రెండు కాలేజీలను లయోలా కాలేజీ సంస్థకు అప్పగించేశారు. కానీ పులివెందల కి కాస్త దూరంలో ఉన్న సింహాద్రిపురం లోని కాలేజీని ఇప్పటికీ వైయస్సార్ కుటుంబం నిర్వహిస్తోంది.
Powered by Froala Editor