ఈ మధ్యకాలంలో చిన్న చిన్నవాటికి ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణాకావేశంలో ఏం చేస్తున్నారో తెలియక ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడుతున్నారు. ఇంకా ఇలాంటి తరహాలోనే ఇప్పుడు ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలిస్తే.. ఏంటి నిజమా పావురం ప్రాణం తీసిందా అని షాక్ అవుతారు. అలాంటి దారుణమైన ఘటన ఇది. 

 

పావురం ప్రాణం తీసింది అంటే పావురం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణాజిల్లాలోని పెడన మండలం కట్లపల్లికి చెందిన అబ్దుల్ ఇర్ఫాన్ ఐస్ బండి వ్యాపారం చేస్తున్నాడు. ఇంక ఈ నేపథ్యంలోనే వ్యాపారం పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చిన ఇర్ఫాన్ పావురాల విషయంపై అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ రావుతో గొడవ పడ్డాడు.

 

దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న ప్రభాకర్ రావు రెచ్చిపోయాడు.. అక్కడే ఉన్న చాకుతో ఇర్ఫాన్ ను హత్య చేశాడు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఇర్ఫాన్. అయితే అలా కత్తితో పొడుస్తున్న సమయంలో అడ్డుకున్న ఇర్ఫాన్ భార్యపై కూడా దాడి చేశాడు ప్రభాకర్ రావు. 

 

తీవ్రగాయాల కు గురైన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది, కాగా ఈ ఘటన జరిగిన తర్వాత స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వగా స్పాట్ కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పావురాలు కోసం హత్య జరగడంతో ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.                     

మరింత సమాచారం తెలుసుకోండి: